మూడు ముక్కలయ్యేందుకు సిద్ధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్.. నిజమా?

శుక్రవారం, 6 జనవరి 2023 (10:54 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే రెండు ముక్కలైంది. ఇపుడు నవ్యాంధ్ర ప్రదేశ్ మరో మూడు ముక్కలయ్యేందుకు సిద్ధంగా ఉందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఏపీ మూడు ముక్కలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు. 
 
సీనియర్ పాత్రికేయులు ఆలపాటి సురేశ్ కుమార్ రాసిన వ్యాసాల సంకలనం రాజ్యం మతం కోర్టులు హక్కులు అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ నగరంలో జరిగింది. 
 
ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఆలపాటి రాసిన పుస్తకం హేతుబద్ధమైన తాత్విక ఆలోచనలను అందిస్తుందన్నారు. రచయితలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉండాలని ఆయన కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు