కార్యకర్తలతో మంత్రి గంటా తనయుడు రహస్య భేటీ... పవన్ పార్టీకి పట్టు వుందా?

మంగళవారం, 26 జూన్ 2018 (10:28 IST)
భీమిలి నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్యనాయకులు, గంటా అభిమానులు పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో,  నియోజకవర్గంలో నాలుగేళ్ల జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, క్షేత్ర స్థాయిలో అవి అమలు తీరుపై నాయకులను ఆరా తీశారు మంత్రి తనయుడు రవితేజ.
 
భీమిలి నుంచి గంటా శ్రీనివాస్ రావు గెలుపు కష్టమన్న వార్తలు రావడం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు సమాచారం. ఈ సందర్భంలో మనకు పార్టీతో సంబంధం లేకుండా గెలుస్తామనే ధీమాను రవితేజకు కార్యకర్తలు తెలియజేశారు. భీమిలిలో జనసేన పార్టీ పరిస్థితిపై గంటా తనయుడు ఆరా తీసినట్టు సమాచారం. గత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రవితేజ తదుపరి రాజకీయాలు దూరంగా ఉన్నారు. హఠాత్తుగా ఇప్పుడు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి తాజా రాజకీయ పరిణామాలపై ఆరా తీశారు రవితేజ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు