అరిష్టం అని అంటున్నా మంత్రి నారాయణ పట్టించుకోవడం లేదట... ఇంతకీ ఏంటది?

గురువారం, 18 మే 2017 (17:03 IST)
ఏదైనా శుభాకార్యాలకు వెళ్లేటపుడు పిల్లి ఎదురుపడ్డా, కట్టెలు కనిపించినా ఆ శుభకార్యాన్ని అడ్డంగా ఆపేస్తారు చాలామంది. మన సంప్రదాయాలు ఇలాంటి ఎన్నో విశ్వాసాల మీదనే నడుస్తుంటాయి. ఇకపోతే మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ కారు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. అతడు వాయువేగంతో నడిపిన బెంజ్ కారే అతడికి యమపాశంగా మారింది. 
 
ఇప్పుడా కారు ఏమవుతుందా అని అందురూ అనుకుంటుండగా దానిపై ఓ వార్త హల్చల్ చేస్తోంది. అదేంటంటే... నారాయణ ఆ కారుకు మరమ్మతులు చేయించి తన ఇంటి వద్ద పెట్టించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఐతే కుమారుడు ప్రాణాలు తీసిన ఆ కారును ఇంట్లో పెట్టుకుంటే అరిష్టమని అందరూ గోల చేసేస్తున్నారు. కానీ నారాయణ మాత్రం ఆ మాటలను ఎంతమాత్రం పట్టించుకోవడంలేదట. తన కుమారుడి జ్ఞాపకార్థం ఆ కారును ఇంట్లోనే పెట్టనున్నట్లు చెపుతున్నారట.

వెబ్దునియా పై చదవండి