ఏపీఎస్ఎస్‌డీసీ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా

సోమవారం, 27 డిశెంబరు 2021 (11:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ - ఏపీఎస్ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో సోమవారం భారీ జాబ్ మేళాను నిర్వహించనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు జరుగనుంది. ఇందులో నోటిఫికేషన్‌లో భాగంగా, వరుణ్ మోటార్స్, మీషో, క్విస్ కార్పొరేషన్ లిమిటెడ్, డీమార్ట్ కంపెనీల్లో పలు ఉద్యోగాల పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. 
 
అయితే, డీమార్ట్‌లో క్యాషియర్, సేల్స్ అసోసియేట్, గోడౌన్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి దరఖాస్తు చేసుకునేవారు పది, ఇంటర్, డిగ్రీ విద్యార్థతలు కలిగివుండాలి. ఈ పోస్టులకు ఎంపికైన వారికి రూ.10,900 నుంచి రూ.11,500 వరకు వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థులు విజయవాడ, గుంటూరు, ఒంగోలులలో పనిచేయాల్సి ఉంటుంది. 
 
అలాగే, వరుణ్ మోటార్స్‌లోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా మెకానికల్, ఆటోమొబైల్, ఏదేని డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.8,500 నుంచి రూ.12 వేల వరకు వేతనం చెల్లిస్తారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 29 యేళ్లలోపు ఉండాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు