జగన్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది- అయ్యన్న పాత్రుడు

శనివారం, 8 ఫిబ్రవరి 2020 (16:56 IST)
ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 8 నెలలు అయ్యింది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పిచ్చోడి చేతిలో రాయిలా తయారయింది రాష్ట్ర పరిస్థితి. నా రాజకీయ జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు. ఆయన నిర్ణయాలు వల్ల రాష్ట్రం చాలా నష్ట పోయింది. ప్రజలు కూడా ఈ పరిపాలనపై ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రం వెనక్కి వెళ్లి పోయింది.
 
మాజీ ఏపీ సీఎం చంద్రబాబుపై  కక్ష పురితంగా వెళ్తున్నారు. రాజధానిని ఏ ప్రాంత ప్రజలు అడిగారు.. ఆనాడు అసెంబ్లీలో కూడా అమరావతి రాజధాని అని ఒప్పుకున్నావ్.. ఒకటే రాష్ట్రం ఒకటే రాజధానిగా ఉండాలి. బొత్స వారి ప్రాంతాల గురుంచి మాట్లాతున్నారు ఆనాడు మంత్రిగా ఉన్నపుడు ఎందుకు ప్రాంతాల అభివృద్ది ఎందుకు గుర్తుకు రాలేదు. 
దమ్ము ఉంటే హై కోర్ట్ అసెంబ్లీ సచివాలయం అని విశాఖలోనే పెట్టండి. 
 
విశాఖపై అంత ప్రేమ ఉంటే పరిశ్రమలు తీసుకురండి. రాజధాని మార్పు చిన్న విషయం కాదు.. అమరావతి కోసం 33 వేల ఎకరాలు రైతులు ఇస్తే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా..? 50 రోజుల నుండి రైతులు ఆందోళన చేస్తే ఒకరైన వారి సమస్య పరిష్కారం చేసారా.? అసెంబ్లీకి దొడ్డి దారిన వెళ్తున్న పరిస్థితి ఏర్పడింది కోర్ట్‌కి మాత్రం రాజా మార్గం‌లో వెళ్తున్నావ్..
 
ఎక్కడ చూసినా పోలీసులే... ఇది ప్రజాస్వామ్యమా పోలీసుల స్వామ్యమా.. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి కూడా బాగో లేదు...
 రాష్ట్రంలో రకరకాల కారణాల చెప్పి పెన్షన్స్ తెసేసావ్.. మద్యం రేట్లు కూడా దారుణంగా పెంచేశావ్...ఆ పెంచిన ఆదాయం అమ్మఒడి రూపం లో ఇస్తున్నావ్.
 
 అమరావతిలో ల్యాండ్ పూలింగ్ తప్పు అని ఆనాడు మీరే చెప్పారు. మరి మీరు ఎందుకు ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు.
 విజయ్ సాయి రెడ్డి విశాఖలో ఎందుకు ఇళ్ళు తీసుకొని ఉంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ భూములు లేవు. ఒక్క విశాఖలోనే భూములు దోచుకోవడానికి ఉన్నారు. ఏ తప్పు చేశాను నా మీద కేసు పెట్టారు... పరిపాలన విధానం బాగోలేక ప్రజలను తప్పు పట్టించే విధంగా రాజధాని మార్పు అని రాజకీయం చేస్తున్నారు.
 
కేంద్ర బడ్జెట్‌లు రెండు అయ్యాయి. ఇప్పటికి మీ ఎంపీలు పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా గురించి అడిగారా...? నవరత్నాలుకు డబ్బులు లేక విశాఖ 2 వేల ఎకరాలు అమ్మి ఖర్చు పెడుతున్న పరిస్థితి నెలకొంది. 
 
నీలాగా వీరవీగిన వారు మట్టిలో కలిసిపోయిన్న పరిస్థితిలు ఉన్నాయ్.. నీకు అదే పరిస్థితి వస్తుంది.. పోలీస్ వ్యవస్థని నేడు  భ్రష్టుపట్టించావ్. సృజల స్రవంతి పనులు ఎందుకు ఆగాయి. దీని గురించి మాట్లాడం కూడా లేదు. బొత్స మంత్రిగా ఉన్నపుడు ఓక్స్ వేగన్ పరిశ్రమ ఎందుకు ఆనాడు ఎందుకు ఈ ప్రాంతం నుండి వెళ్లి పోయింది. 
 
రాజధాని మార్పు అనేది చిన్న  విషయం కాదు ఇది మేజర్ ప్రాబ్లెమ్. రాజధానిపై అందరి అభిప్రాయాలు తీసుకోవాలిగా అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు