వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలంలోని సాయిపురం గ్రామానికి చెందిన వెంకటేశ్ దంపుతులు మంగళవారం స్వామి వారి దర్శనం కోసం వచ్చారు. మంగళవారం రాత్రి కావడంతో శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న గొల్లమండంపం దగ్గర తమ కుమారుడు(1) చెన్నకేశవులుతో కలిసి నిద్రించారు. దంపతులిద్దరూ గాఢనిద్రలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి బాబును ఎత్తుకెళ్లిపోయాడు.
ఈ విషయం తెలిసి బాలుడి తల్లి బోరున విలపించింది. ఈ ఘటనపై తిరుమల టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాలుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. విచారణలో భాగంగా ఆలయంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు నిందితుడి దృశ్యాలు కనిపించాయి. వాటి ఆధారంగా ఆ దొంగను పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.