Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

సెల్వి

శనివారం, 14 జూన్ 2025 (11:00 IST)
Manchu Lakshmi Prasanna
ఎయిర్ ఇండియా విమానం AI171 అహ్మదాబాద్‌లో ఇద్దరు అనుభవజ్ఞులైన పైలట్లు నడుపుతుండగా ప్రమాదానికి గురైంది. ఈ విమానంలో నటి, నిర్మాత మంచు లక్ష్మి కూడా తన కూతురితో కలిసి ప్రయాణించారనీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో విడుదల చేసింది. 
 
ఈ మేరకు ఆమె ఇన్ స్టా స్టోరీలో వీడియో షేర్ చేసింది. నేను అందరికి పర్సనల్‌గా మెసేజ్ చేశాను. అలాగే స్టోరీ కూడా పంపించా. నేను నా కూతురు సేఫ్‌గా ల్యాండ్ అయ్యాం. తాను కూడా ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం చేశానని తెలిపిన మంచు లక్ష్మీ, తాను లండన్ వెళ్లలేదని ముంబై వెళ్ళాను అని తెలిపారు. 
 
ఈ విషయంపై చాలా మంది తనకు ఫోన్‌లు, మెసేజ్‌లు చేశారని, మీ అందరి ప్రేమ వల్ల నేను, నా కూతురు క్షేమంగా ఉన్నాం అని తెలిపింది మంచు లక్ష్మీ. విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంచు లక్ష్మీ. విమాన ప్రమాదం గురించి ఊహించుకుంటేనే భయంగా ఉంది అన్నారు లక్ష్మీ. 
 
చాలామంది తనకు ఏమైనా ప్రమాదం జరిగిందా అనే ఆందోళనతో కాల్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. దేవుడి దయ వల్ల తాను క్షేమంగా ఉన్నానంటూ ఒక వీడియోను విడుదల చేశారు. కాగా ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మందితో సహా 265 మంది మరణించారు. 
 
విమాన ప్రమాదంలో గాయపడిన వారిని ప్రధాని మోదీ కలిశారు. విమాన ప్రమాదంలో మరణించిన వారిలో ఆరుగురిని గుర్తించిన తర్వాత, మృతదేహాలను వారి వారి కుటుంబాలకు అప్పగించారు.

దేవుడి దయ వల్ల క్షేమంగా బయటపడ్డా: మంచు లక్ష్మి

విమాన ప్రమాదం జరిగిన రోజే ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో తాను ప్రయాణించానని చెప్పారు. కానీ, తాను ముంబై నుంచి లండన్ వెళ్లినట్లు చెప్పారు. చాలామంది తనకు ఏమైనా ప్రమాదం జరిగిందా అనే ఆందోళనతో కాల్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. దేవుడి దయ వల్ల… pic.twitter.com/I6z0TZcCqo

— ChotaNews App (@ChotaNewsApp) June 14, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు