ఆమె బుధవారం భవానీ ఐల్యాండ్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమా నాగిరెడ్డి మృతితో నంద్యాల నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉందన్నారు. ఈ ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని, ఈ నెల 24వ తేదీన శోభా నాగిరెడ్డి వర్థంతి రోజున అభ్యర్థి ఎవరో ప్రకటిస్తామని తెలిపారు.