పాల ఉత్పత్తులతో పండ్లను కలపడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని కొందరు నమ్ముతుంటారు. అయితే జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. పెరుగులో ఫ్రెండ్లీ ప్రోబయోటిక్స్ ఉంటాయి. అయితే మామిడి పండ్లలో డైటరీ ఫైబర్, ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడే ఎంజైమ్లు ఉంటాయి. ఇవి రెండూ కలిసి, అవి జీర్ణ ప్రక్రియకు సహాయపడతాయి. ముఖ్యంగా లాక్టోస్ సెన్సిటివిటీ లేని వారికి ఇది ఉపయోగపడుతుంది. అయితే, బలహీనమైన జీర్ణక్రియ లేదా పాలు అంటే గిట్టని వారికి అంటే అలెర్జీ ఉన్నవారు ఈ కాంబోను మితంగా తీసుకోవాలి.
మామిడి, పెరుగు రెండూ రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇచ్చే పోషకాలను సమృద్ధిగా కలిగివుంటాయి. మామిడి పండ్లు విటమిన్ సి, బీటా-కెరోటిన్ మోతాదును అందిస్తాయి. మెరిసే చర్మానికి. ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి గొప్పగా పనిచేస్తాయి. మరోవైపు, పెరుగులో జింక్, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఈ రెండూ వేసవి అలసట, సాధారణ ఇన్ఫెక్షన్లకు దూరం చేస్తాయి.
మామిడి పండ్లు త్వరగా విడుదల చేసే సహజ చక్కెరలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. పెరుగు ప్రోటీన్, కాల్షియంను అందిస్తుంది. ఈ రెండింటి కాంబోలో స్నాక్స్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పెరుగులోని ప్రోటీన్ శక్తి స్థాయిలను నిలబెట్టడానికి సహాయపడుతుంది. ఆకలిని దూరం చేస్తుంది.