మంగళవారం తిరుపతిలో ఆ మహానేత 5వ వర్దంతి వేడుకలు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ మహానేత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన సంక్షేమ పథకాలు ఏ ఒక్కరికీ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ చనిపోయిన అనంతరం రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా వైయస్ సతీమణి విజయమ్మ, కుమారుడు జగన్, కోడలు వైయస్ భారతి, కూతురు షర్మిల ఇతర కటుంబ సభ్యులతో నివాళులు అర్పించారు.