గ‌వ‌ర్న‌ర్‌ని క‌లిసిన భాజ‌పా నేత‌లు.. మర్మమేమిటో?

శుక్రవారం, 26 జులై 2019 (20:56 IST)
భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ నేతృత్వంలో ఆ పార్టీ నేత‌లు ప‌లువురు శుక్ర‌వారం రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌ని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.

ఈ సంద‌ర్భంగా భాజ‌పా ఏపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ నూత‌న గ‌వ‌ర్న‌ర్‌ని శాలువాతో స‌త్క‌రించి, శ్రీవారి ప్ర‌తిమ‌ను అంద‌జేసి అభినంద‌న‌లు తెలిపారు. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వెంట ప‌లువ‌రు భాజ‌పా రాష్ట్ర‌, న‌గ‌ర నేత‌లు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు