రాష్ట్రంలోని బీజేపీ నాయకులను తాను సిల్లీ ఫెలోస్ అని పిలుస్తానని సినీ నటుడు శివాజీ అన్నారు. ఎన్నికలకు ముందు వారు చెప్పిన మాటలేంటి? పోలవరం మన జీవనాధారం అన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం ప్రారంభమైన ప్రాజెక్టు నేటికీ పూర్తి కాలేదని మొసలి కన్నీరు కార్చారని మండిపడ్డాడు. ఎస్వీరంగారావును తలపించేలా డైలాగులు చెప్పారని విమర్శించారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత వారు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు.