పంచభూతాలను మార్కెట్ చేస్తున్న టీడీపీ మంత్రులు : బొత్స ఫైర్

బుధవారం, 7 అక్టోబరు 2015 (11:54 IST)
రాజధాని నిర్మాణం పేరుతో టీడీపీ మంత్రులు కేవలం భూమిని మాత్రమే కాకుండా పంచభూతాలను కూడా మార్కెట్ చేస్తున్నారని వైకాపా నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... టీడీపీ నేతలు పంచభూతాలను సైతం మార్కెట్‌ చేస్తున్నారని ధ్వజమెత్తారు. మట్టి, ఇసుకను అమ్ముకుంటున్నారని దుయ్యబట్టారు. 
 
విజయనగరం జిల్లా భోగాపురంలో జగన్‌కు సెంటు భూమి ఉందని నిరూపిస్తే.. దేనికైనా సిద్ధమేనని, కాదని తేలితే టీడీపీ నాయకులు రాజకీయాల నుంచి వైదొలుగుతారా అని సవాల్‌ చేశారు. రాష్ట్రానికి మేలు జరిగేందుకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకే జగన్‌ ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారని బొత్స తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి