కాణిపాకంలో వెలిగిపోతున్న వ‌ర సిద్ధి వినాయ‌కుడు

శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (13:01 IST)
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆడంబరంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితి సంద‌ర్భంగా ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. ఉదయం 4 గంటలకు స్వామి వారి మూల విరాట్ కు పలు అభిషేకాలు నిర్వహించి 5 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతులిచ్చారు.
 
గ‌ణ‌ప‌తి న‌వ‌రాత్రుల సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్తాలు సమర్పించారు. ఈ వేడుక‌లో స్థానిక శాసనసభ్యుడు  ఎమ్మెస్ బాబు, ఎంపీ రెడ్డెప్ప, చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు పాల్గొని, స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి వెంకటేశు,  కానిపాకం సర్పంచ్  శాంతి సాగర్ రెడ్డి,  రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పరమేశ్వర్రెడ్డి,  ఐరాల మండలం  కన్వీనర్ బుజ్జి రెడ్డి మరియు స్థానిక నాయకులు ఆల‌య  అధికారులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు