వ్యభిచారం కేసులో పట్టుబడిన మహిళ, వ్యభిచారగృహ నిర్వహకులు, బ్రోకర్ల మాత్రమే కేసు నమోదు చేయడం తగదని, విటుడిపైనా కేసు నమోదు చేసే విధంగా చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.
కేసును విచారించిన జడ్జి జస్టిస్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ వ్యభిచార గృహాన్ని నిర్వహించడం, వ్యభిచారానికి అనుమతించడం, వ్యభిచారంపై వచ్చిన ఆదాయంతో జీవించడం, విటులను ఆకర్షించడం తదితరమైనవన్నీ సెక్షన్ 3,4,5 కింద వస్తాయన్నారు.