ఈ విమానం ప్రమాదానికి గురైన సమయంలో పది మంది ఉన్నారు. సాంకేతిక నిపుణులను రాంచీ తీసుకెళుతుండగా సాంకేతిక లోపం కారణంగా విమాన ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకోగా, 15 ఫైరింజన్లు మంటలార్పుతున్నాయి. విమానంలో మొత్తం 10 మంది బీఎస్ఎఫ్ జవాన్లు ఉన్నారని తెలిసింది.