ఆ రోజు పార్లమెంటులో జగన్ ఏమయ్యాడు..? : అసెంబ్లీలో చంద్రబాబు

సోమవారం, 31 ఆగస్టు 2015 (12:08 IST)
ప్రస్తుతం ఇంతగా హడావుడీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో ఏమి చేస్తున్నట్లని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. నాడు ఎంపీగా ఉన్న ఆయన ఎక్కడ దాక్కున్నారని అడిగారు. 
 
శాసనసభలో ప్రత్యేకహోదా రాలేదనే ఆవేదనతో ఆత్మబలిదానం చేసిన వారికి సంతాపం తెలియజేయాలని ప్రతిపాదన సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీ తీర్మానం చేయాలని, కేంద్రంలో ఉన్న తెలుగుదేశం మంత్రులు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. 
 
దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రం విభజన జరుగుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నారని ఆయన ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి కారణంగానే రాష్ట్ర విభజన జరిగే పరిస్థితి నెలకొందన్నారు. ఎంపీగా ఉన్న సమయంలో జగన్ ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు. ఆయన ప్రస్తుతం మొసలి కన్నీరు కార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి