ఇప్పుడు అమరావతి రైతులు కూడా అదే విధంగా ముందుకొచ్చారు. ఇదొక కేస్ స్టడీ.. అంటూ బాబు అన్నారు. తనకున్న అనుభవంతో తెలంగాణలోని ఏడు మండలాలను విలీనం చేయించానని, పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపితేనే.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పానని బాబు అన్నారు.
ఈ క్రమంలో అమరావతిలో 9 నగరాలు ప్లాన్ చేశామని బాబు అన్నారు. అందులో ప్రభుత్వ సిటీ, ఆర్థిక సిటీ, నాలెడ్జ్ సిటీ, జస్టిస్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, టూరిజం సిటీ, మీడియా సిటీ, ఎలక్ట్రానిక్ సిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అయితే ఇవన్నీ కూడా నాలుగు ఆఫీసులు కట్టేస్తే అయిపోదన్నారు.