అదనపు కట్నం కోసం కోడలిని వ్యభిచారం కూపంలోకి... అదను చూసి కానిస్టేబుల్ అత్యాచారం

సోమవారం, 20 ఏప్రియల్ 2015 (20:45 IST)
స్త్రీల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా వారి రక్షణ కరవవుతోంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తమకు అదనపు కట్నం కావాలంటూ కోడలిపై ఆరళ్లు మొదలెట్టింది. డబ్బు తేలేదన్న కోపంతో కోడలిని వ్యభిచారం కూపంలోకి నెట్టేందుకు ప్రయత్నించింది. ఇదే అదనుగా శ్రీకాళహస్తికి చెందిన రూరల్ కానిస్టేబుల్ మోహన్ బాబు బాధితురాలి అత్త సాయంతో ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని బాధితురాలు శ్రీకాళహస్తి డీఎస్పీకి ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. అతడికి సహకరించిన బాధితురాలి అత్తను కూడా జైలుకు పంపారు.

వెబ్దునియా పై చదవండి