సీఎం జగన్‌పై రాయితో దాడి.. ఎన్నికల సంఘం ఆరా!!

వరుణ్

ఆదివారం, 14 ఏప్రియల్ 2024 (08:28 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై చిన్నపాటి రాయితో దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన ఎడమ కన్ను పైభాగంలో చిన్నపాటి దెబ్బ తగిలింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనా ఆరాతీశారు. విజయవాడ పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు. ఆదివారం సాయంత్రం లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పైగా, ఈ దాడి నేపథ్యంలో జగన్ తన బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఈ దాడి శనివారం రాత్రి జరిగింది. ఆదివారం కావడంతో దాడిని సాకుగా చూపించి బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చారన్న వ్యాఖ్యానాలు కూడా విపక్ష నేతల నుంచి వినిపిస్తున్నాయి. అలాగే, తదుపరి యాత్రపై వైకాపా ఆదివారం క్లారిటీ ఇవ్వనుంది. 
 
మరోవైపు, విజయవాడ సీపీతో మాట్లాడిన ముఖేశ్ కుమార్ మీనా... ఏం జరిగిందన్న దానిపై ఆదివారం సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నిందితులు త్వరగా గుర్తించాలని సీపీని సూచించారు. మరోవైపు, రాయిదాడిలో చిన్నపాటి గాయం తగిలిన జగన్‌ను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. నుదుటిపై వాపు ఎక్కువగా ఉండటంతో విశ్రాంతి అవసరమని పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఎం తన యాత్రకు ఆదివారం విరామం ఇచ్చారు. యాత్ర తదుపరి షెడ్యూల్‌పై వైకాపా ఆదివారి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు