అమరావతి : రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే పరిణామానికి అడుగులు పడుతున్నాయి. సింగపూర్, మలేషియా తదితర దేశాలకు దగ్గరగా ఏపీ ఉండటం, రాష్ట్రానికి పొడవైన తీరం ఉండటంతో సముద్ర రవాణాకు ఏపీ అత్యంత కీలక ప్రాంతంగా ఉంది. దీంతో, దేశంలోని తూర్పుతీర ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకుంటున్న కోస్టల్ ఎకనామిక్ జోన్కు కూడా రాష్ట్రమే కీలకం కానుంది. ఈ జోన్ను అటు ఒడిసా నుంచి ఏపీ వరకూ, లేకుంటే ఏపీ నుంచి చెన్నై వరకూ ఎటు ఏర్పాటు చేసినా ఏపీ భాగస్వామ్యం అనివార్యం.