విశేషం ఏమంటే, ఆ షూటింగ్ సమయంలోనే దర్శకుడు హరీష్ శంకర్ కూడా పాల్గొన్నారు. బ్రేక్ టైంలో ఆయనతో పవన్ కళ్యాణ్ చర్చించుకునేవారు. తాజా సమాచారం మేరకు 45రోజులపాటు ఉస్తాద్ గబ్బర్ సింగ్ కొనసాగింపు షూటింగ్ చేయడానికి సమయం ఇచ్చినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్, అమరావతి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ కు ప్లాన్ చేసుకోమని పవన్ సూచించినట్లు సమాచారం. అతి త్వరలో ఈ సినిమా గురించి ప్రకటన రాబోతుంది.
ఇదిలా వుండగా, ఇప్పటికే హరి హర వీర మల్లు విడుదలకు సిద్ధమైనా, సాంకేతికతవల్ల జులై 4న సినిమా విడుదలచేయాలని నిర్మాత ఎ.ఎం. రత్నం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఓజీ షెడ్యూల్ కూడా పూర్తికావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. దర్శకుడు సాగర్ ఈ సినిమాపై మంచి హోప్స్ లో వున్నాడు. DVV ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీత దర్శకుడు.