విజయ్ సూసైడ్ కేసులో మరో ట్విస్ట్... పరారీలో వనిత

శుక్రవారం, 15 డిశెంబరు 2017 (14:54 IST)
హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్. ఆయన భార్య వనితా రెడ్డి గత రెండు రోజులుగా కనిపించడం లేదు. ఆమెతో పాటు ఆమెకు సహకరించిన న్యాయవాది కూడా ఫోనులోకి అందుబాటులో లేడు. దీంతో విజయ్ ఆత్మహత్య కేసులో వీరిద్దరికీ సంబంధం ఉందని పోలీసులు విశ్వసిస్తున్నారు. 
 
ఇటీవల సూసైడ్ చేసుకున్న విజయ్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇన్నాళ్లూ తన భర్త మృతి చెందడానికి తనకూ సంబంధం లేదని చెప్పిన వనితా రెడ్డి పోలీసుల కంట పడకుండా తప్పించుకుతిరుగుతున్నట్లు తెలిసింది. పోలీసులు విచారణలో భాగంగా వనితారెడ్డి ఇంటికి వెళ్లగా, తన కూతురికి అనారోగ్యంగా ఉందని వనిత తల్లి చెప్పినట్లు తెలిసింది. 
 
అయితే వనితారెడ్డి సూర్యాపేటలో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆమె తప్పించుకోవడానికి యత్నిస్తుందేమోనని అనుమానిస్తున్నారు. న్యాయవాది శ్రీనివాస్ కూడా ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. దీంతో పోలీసులకు ఈ అనుమానం మరింత బలపడింది. ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందని, అరెస్ట్ చేయాలని విజయ్ తండ్రి డిమాండ్ చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు