ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.. కాంగ్రెస్ నిరసన ప్రదర్శన

గురువారం, 18 నవంబరు 2021 (15:38 IST)
రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించాలన్న డిమాండ్‌తో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం పబ్లిక్‌ గార్డెన్స్‌ నుంచి వ్యవసాయశాఖ కమిషనరేట్‌ వరకు కాంగ్రెస్‌ పార్టీ నిరసన ప్రదర్శనను నిర్వహిస్తోంది. ఈ నిరసన కార్యక్రమం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగింది.
 
ఈ నిరసన ప్రదర్శనలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొననున్నారు. వ్యవసాయశాఖ కమిషనరేట్‌ వరకు ప్రదర్శన అనంతరం  రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలంటూ వినతిపత్రం సమర్పించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు