నందిగామలో టీడీపీ అభ్యర్థి సౌమ్య గెలుపు.. మెదక్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం..

మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (11:10 IST)
నందిగామ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిపై ఆమె 73,807 ఓట్ల భారీ మెజార్టీని సాధించారు. చివరి రౌండ్లలో కాస్త పుంజుకోవడం ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి బాబురావు కష్టపడి డిపాజిట్ దక్కించుకోగలిగారు. ఈ ఎన్నికల్లో వైకాపా పోటీ చేయని విషయం తెల్సిందే. 
 
ఇకపోతే.. మెదక్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ మెజార్టీ రౌండు రౌండుకు పెరుగుతూనే ఉంది. ఐదో రౌండు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి లక్షా పదివేల ఆధిక్యాన్ని సాధించారు. రెండో స్థానం కోసం కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీ పోరాడుతున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి మూడో రౌండ్ పూర్తయ్యేసరికి 65,597 ఓట్ల ఆధిక్యతను సాధించారు. లెక్కింపులో ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌కు 1,00,288 ఓట్లు రాగా... కాంగ్రెస్ అభ్యర్థికి 34,691 ఓట్లు... బీజేపీ అభ్యర్థి 24,547 ఓట్లు సాధించారు. 

వెబ్దునియా పై చదవండి