తిరుమల శ్రీవారి సర్వదర్శన క్యూలైన్లలోకి పాము ప్రవేశించింది. దీన్ని చూసిన భక్తులను భయాందోళనకు గురయ్యారు. ఎంబిసి 34 వద్దగల ఉచిత దర్శనం క్యూలైన్లో పాము ఉన్నట్లుండి ప్రవేశించింది. భక్తుల కాళ్ళ మధ్య దూరడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఒకరిని ఒకరు తోసుకుంటూ భక్తులు క్యూలైన్లో పరుగులు తీశారు.