నడిగడ్డ రాజకీయ ఉద్దండుడు మాజీ మంత్రి డికె సమరసింహారెడ్డి తెలుగుదేశం పార్టీకి బై బై చెప్పేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయనకు టికెట్ను కేటాయించకుండా బిజెపికి టికెట్ కేటాయించడం మాట వరుసకు కూడ ఆయనతో చర్చించలేదనే అలకతో సమరసింహారెడ్డి గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు.