డాలర్ శేషాద్రికి మెరుగైన చికిత్స... బయటపడ్డారు...

బుధవారం, 1 అక్టోబరు 2014 (18:23 IST)
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా ఉన్న డాలర్ శేషాద్రికి గుండెపోటు రావడంతో స్థానిక అశ్వని ఆస్పత్రికి తరలించారు. ఐతే అక్కడ ఆయన ఆరోగ్యం విషమించడంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం స్విమ్స్ కి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రమాదం నుంచి బయటపడ్డట్లు వైద్యులు వెల్లడించారు.
 
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తీరిక లేకుండా ఉండటం వల్ల ఆయన అస్వస్థతకు లోనయ్యారు. సీఎం చంద్రబాబు ఆదేశంతో ఉన్నతాధికారులు దగ్గరుండి ఆయన ఆరోగ్యపరిస్థితిపై వాకబు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి