ఏపీ డీఎస్సీ 2014 నోటిఫికేషన్ను జారీ చేసినట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 9061 పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఇందులో 1949 పోస్టులు స్కూల్ అసిస్టెంట్లు, 812 భాషా పండితులు, 156 పీఈటీ, 6244 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు డిసెంబర్ 3 నుంచి జనవరి 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 9, 10, 11 తేదీల్లో ఉపాధ్యాయ నియామక పరీక్షలు జరుగుతని చెప్పారు. జూన్ 28న ఉపాధ్యాయ నియామక రాత పరీక్షలు జరుగుతాయని తెలిపారు.