నారా భువనేశ్వరికి ఎన్నికల సంఘం నోటీసులు.. ఎందుకో తెలుసా?

వరుణ్

ఆదివారం, 24 మార్చి 2024 (12:34 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి, మృతుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారంటూ పేర్కొంటూ ఆమెకు నోటీసులు పంపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. నారా భువనేశ్వరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఈసీకి వైకాపా నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ఆమెకు నోటీసులు జారీచేసింది. ఈ ఘటనపై 24 గంటల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. 
 
కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి అప్పట్లో పర్యటనలు చేపట్టారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెంది మరణించిన వారి కుటుంబాలను కలిసి వారిని ఓదార్చుతూ మృతుల కుటుంబాలకు ఆమె రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. దీన్ని వైకాపా నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పరిగణించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ నోటీసులు జారీచేసింది.
 
డబ్బుల కోసం ఏమైనా రాస్తారా? దేశంలో ఒంటరిగా జీవిస్తున్న మహిళలు లేరా? నటి మీనా ప్రశ్న
 
సీనియర్ నటి మీనా తన రెండో పెళ్లిపై వస్తున్న పుకార్లపై మండిపడ్డారు. డబ్బు కోసం ఏమైనా, ఎలాంటి వార్తలనైనా రాస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వార్త రాసేముందు నిజా నిజాలు తెలుసుకోరా అని ఆమె ప్రశ్నించారు. తాను ఒంటరిగానే ఉంటానని, దేశంలో ఒంటరిగా నివశిస్తున్న మహిళలు లేరా అని ఆమె సూటిగా అడిగారు. తన తల్లిదండ్రులు, కుమార్తె భవిష్యత్ కోసమే తన ఆలోచనలన్నీ ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. 
 
గత 1990లో చిత్రపరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన మీనా... వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే, ఆ మధ్య తన భర్త సాగర్‌ను కోల్పోయింది. ఆ బాధ నుంచి బయటపడేందుకు మళ్లీ సినిమాల్లో నటిస్తుంది. వరుస షూటింగులతో బిజీగా గడుపుతుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. 
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తాను రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు రాస్తున్నారు. ఈ విషయం వారికి ఎవరు చెప్పారో తనకు తెలియదు. డబ్బు కోసం ఎలాంటి వార్తలైనా రాస్తారా అని ప్రశ్నించారు. మీడియా నానాటికీ దిగజారిపోతుందన్నారు. ఒక వార్త రాసే ముందు వాస్తవాలు తెలుసుకుని రాయాలని ఆమె హితవు పలికారు. తాను ఒంటరిగానే ఉంటానని, దేశంలో ఒంటరిగా జీవిస్తున్న మహళలు ఎంతో మంది ఉన్నారని చెప్పుకొచ్చింది. తన తల్లిదండ్రులు, తన కుమార్తె భవిష్యత్ కోసం ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నట్టు చెప్పారు. తాను భవిష్యత్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటానో ఇపుడే ఎలా చెబుతానని ప్రశ్నించింది. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో తనకు తెలియదన్నారు. ప్రస్తుతానికి రెండో పెళ్ళి గురించి ఆలోచన లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు