మొదటి భార్య చనిపోతే రెండో పెళ్లి చేసుకున్నాడు, కొత్త భార్య ప్రియుడితో జంప్

గురువారం, 4 మార్చి 2021 (16:25 IST)
మొదటి భార్య చనిపోయి 6 నెలలయింది. పిల్లల సంరక్షణ సమస్య కావడంతో అటువైపు, ఇటువైపు బంధువులు మరో పెళ్లి చేసుకోవాలని అతడిపై వత్తిడి తెచ్చారు. వారి మాట కాదనలేక రెండో పెళ్లికి సరేనన్నాడు. వచ్చిన కొత్త పెళ్లికూతురు తెల్లారకముందే ప్రియుడితో పారిపోయింది.
 
వివరాలు చూస్తే... అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం కమ్మవారిపల్లికి చెందిన ఓ వ్యక్తి భార్య చనిపోయింది. ఆరు నెలలుగా పిల్లల సంరక్షణ బాధ్యతను అతడే చూసుకుంటూ వస్తున్నాడు. ఐతే వారి సంరక్షణ బాధ్యత కాస్త ఇబ్బందిగా వుండటంతో ఇరు కుటుంబాల బంధువులు మరో పెళ్లి చేసుకోవాలని సూచించారు. దీనితో అతడు కూడా కాదనలేకపోయాడు.
 
గత నెల 28న పెద్దల సమక్షంలో అతడి వివాహం ఘనంగా చేసారు. కాపురానికి భర్తతో పాటు వచ్చిందా యువతి. ఐతే రాత్రంతా ఇంట్లోనే వున్న ఆమె తెల్లారేసరికి కనిపించకుండా పోయింది. ఇంట్లో వున్న 3 తులాల బంగారంతో పాటు రూ. 80 వేలు తీసుకుని తన ప్రియుడితో కలిసి ఒడిశా రాష్ట్రానికి పారిపోయినట్లు కనుగొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివాహిత కోసం గాలిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు