నంద్యాల జిల్లాలో విషాదం.. మట్టిమిద్దె కూలి నలుగురు మృతి

వరుణ్

శుక్రవారం, 2 ఆగస్టు 2024 (08:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాలలో విషాదం చోటుచేసుకుంది. మట్టిమిద్దె కూలి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. ఈ ఘటనలో జిల్లాలోని చాగలమర్రి మడలం చిన్నవంగలిలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు. 
 
ఈ ఘటనలో భార్యాభర్తలు గణశేఖర్ రెడ్డి (45), భార్య దస్తగిరమ్మ (38), వారి ఇద్దరు కుమార్తెలు పవిత్ర (16), గురులక్ష్మి (10)లు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను గ్రామస్తులంతా కలిసి వెలికి తీశారు. కాగా, ఈ దంపతులకు చెందిన మరో కుమార్తె ప్రొద్దుటూరలో చదువుకుంటుంది. దీంతో ఆ యువతి మాత్రం ప్రాణాలతో బయటపడి అనాథగా మిగిలింది. రాత్రికి రాత్రి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తమ నుంచి భౌతికంగా దూరంకావడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు