బైక్‌పై నుంచి కిందపడ్డ ఎంపీ గల్లా జయదేవ్.. బైకెందుకు ఎక్కాడు..?

సోమవారం, 31 ఆగస్టు 2015 (21:38 IST)
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సోమవారం రాత్రి బైక్‌పై నుంచి కింద పడ్డారు. గాయపడ్డ ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితిపై డాక్టర్ల సమీక్ష చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
గల్లా జయదేవ్ సోమవారం రాత్రి కుమారుడి కోసం స్పోర్ట్స్ బైక్ కొనుగోలు చేయడానికి షోరూంకు వెళ్ళారు. అక్కడ నుంచి బైక్ ట్రయల్ రన్ జరపడానికి మెకానిక్‌తో కలసి బైక్‌పై వెళ్ళారు. దాని స్పీడును పరీక్షించే ప్రయత్నంలో స్కిడయ్యి కింద పడ్డారు. దీంతో ఆయన పక్కటెముకలకు తీవ్రమైన దెబ్బలు తగిలినట్లు తెలుస్తోంది. 
 
అయితే ఆయనకు ఎటువంటి ప్రాణ హాని లేకపోయినా 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోక తప్పదని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి