ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొందరు విద్యార్థులు మద్యం, గంజాయి సేవించి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కొందరు విద్యార్థులు మద్యాన్ని సేవించి పాఠశాల మహిళా వంట మనిషిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లి హైస్కూల్లో జరిగింది. ఈ నెల 13వ తేదీ రెండో శనివారం కావడంతో పాఠశాల మిద్దెపై కూర్చొని మద్యం సేవిస్తున్న తొమ్మది, పదో తరగతి విద్యార్థులను ఆమె గమనించి ప్రశ్నించింది. పైగా, వార్డెన్కు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది.