తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఒక సీఎంగా వ్యవహరించడం లేదని, ఇంకా ఉద్యమనేతగానే ప్రవర్తిస్తున్నారని ఏపీ విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి, అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏపి ఉన్నత విద్యామండలికి సంబంధించిన ఎస్బిహెచ్ ఖాతాలను తెలంగాణ ప్రభుత్వం స్తంభింపజేసిందని అన్నారు.