ఇతర రాష్ట్రాల బోర్డుల్లో అమలులో ఉన్న ఇంప్రూవ్మెంట్ విధానాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం చర్చించి విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ద్వితీయ ఇంటర్ పాస్, ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ప్రథమ సంవత్సరం తరహాలోనే సబ్జెక్టుల వారీ ఉత్తమ మార్కుల విధానంతో ఒకే ప్రయత్నంలో ఇంప్రూవ్మెంట్ అవకాశాన్ని ప్రభుత్వం అనుమతించిందని పేర్కొన్నారు.
గత నెలలో జరిగిన పరీక్షలు రాసిన ప్రథమ, ద్వితీయ ఇంటర్ విద్యార్థులు పాస్ లేదా ఫెయిల్ అయినప్పటికీ.. పాస్ అయిన పేపర్లలో మాత్రం ఇంప్రూవ్మెంట్ కోసం హాజరు కావొచ్చన్నారు. ప్రతి పేపర్లో ఉత్తమ మార్కులనే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.
ఫెయిల్ అయిన విద్యార్థులు పాస్ అయ్యే వరకు ఆ పేపర్లు రాసేందుకు ఎలాంటి పరిమితి లేదన్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అవకాశం లేదని స్పష్టం చేశారు పరీక్ష ఫీజు రూ.600తో పాటు ఇంప్రూవ్మెంట్ పరీక్షకు ఒక్కో సబ్జెక్టుకు రూ.160 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 20 నుంచి 27వరకు అవకాశం కల్పించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.