తిరుమలలో భారీ వర్షం... వర్షంలో తడిసి ముద్దయిన భక్తులు

శుక్రవారం, 6 మే 2016 (12:58 IST)
తిరుమల గిరుల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షంలో భక్తులు తడిసి ముద్దయిపోయారు. శుక్రవారం ఉదయం ఉదయం 11.30నిమిషాలకు ప్రారంభమైన వర్షం మధ్యాహ్నం వరకు కురుస్తూనే ఉంది. ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో శ్రీవారి భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
 
అయితే నెలరోజులకు పైగా ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయిన శ్రీవారి భక్తులు ప్రస్తుతం పడుతున్న వర్షంతో హాయిగా సేదతీరుతున్నారు. వర్షం కారణంగా నాలుగు మాడా వీధులు వర్షపు నీటితో నిండిపోయాయి. 
 
తిరుమలలోని లోతట్టు ప్రాంతంలోని కొన్ని షాపుల్లో వర్షపు నీరు ప్రవేశించాయి. వర్షంలో తడుస్తూనే కొంతమంది భక్తులు తిరుమల గిరులను తిలకిస్తున్నారు. క్యూలైన్లలో కూడా భక్తులు తడుచుకుంటూనే కంపార్టుమెంట్లలోకి ప్రవేశిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి