తెలంగాణ ప్రభుత్వానికి టాక్స్ ఇష్యూపై హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే వాహనాలపై పన్ను విషయంలో హైకోర్టు టి. సర్కారుకు ఝలక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే సరుకు, ఇతర రవాణా వాహనాలపై పన్ను వసూలు చేయకూడదని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వచ్చే ఏడాది మార్చి వరకు ఇరు రాష్ట్రాల మధ్య తిరిగే వాహనాలపై పన్ను వసూలు చేయకూడదని సూచించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో పన్ను చెల్లిస్తే ఇరు రాష్ట్రాల్లో తిరగడానికి వాహనాలకు అనుమతి ఇస్తూ గవర్నర్ జూన్ 1వ తేదీన 43వ నెంబర్ జీవో జారీ చేశారు. ఆ జీవోను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం 586 నెంబర్ సర్క్యులర్ను జారీ చేసింది.