బాలయ్య నియోజకవర్గంలో హిజ్రా దారుణ హత్య...

శనివారం, 20 మార్చి 2021 (13:12 IST)
బాలయ్య నియోజకవర్గం హిందూపురంలో దారుణం చోటుచేసుకుంది. ఓ హిజ్రాను గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా గొంతుకోసి హతమార్చారు.
 
హిందూపురం సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో ఈ ఘటన జరిగింది. హిజ్రా గొంతు కోసి హత్య చేసిన తర్వాత మృతదేహంపై కిరోసిన్ పోసి తగులబెట్టారు.
 
స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు