భార్య ప్రవర్తనపై అనుమానంతో భర్త భార్య ప్రాణాలు తీసిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో భర్తే నిందితుడని తేలడంతో నిందితునికి జీవిత ఖైదు, రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ గుంటూరు 3వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ఎన్ సత్యశ్రీ శుక్రవారం తీర్పిచ్చింది.