అతనితో భార్య ప్రేమాయణం.. నిలదీసిన భర్త.. అక్రమ కేసు పెట్టిన అత్తమామలు

మంగళవారం, 3 జులై 2018 (15:52 IST)
కట్టుకున్న భార్య మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీన్ని నిలదీసినందుకు భర్తపై వివిధ రకాల ఆరోపణలు చేసింది. అంతటితో ఆగని ఆమె... చివరకు తల్లిదండ్రుల సహకారంతో తప్పుడు కేసుపెట్టించి పోలీసులతో చితక్కొట్టించింది. దీన్ని అవమానంగా భావించిన అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విజయవాడ సికింద్రాబాద్ స్టేషన్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
విజయవాడకు చెందిన గురువా రెడ్డి అనే వ్యక్తి గాయత్రి అనే యువతితో వివాహమైంది. అయితే, గాయత్రికి కార్తీక్ అనే యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని కనిపెట్టిన భర్త.. భార్య గాయత్రిని నిలదీశాడు. దీంతో భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగింది.
 
ఈ నేపథ్యంలో గాయత్రి ప్రేమాయణంపై ఆమె తల్లిదండ్రులతో గురువారెడ్డి పంచాయతీ నిర్వహించాడు. అయితే కూతురికి మంచి చెప్పాల్సిన తల్లిదండ్రులు ఆ పని చేయకుండా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి అల్లుడిని బెదిరించారు. 
 
అత్తమామల ఆత్మహత్యాయత్నం కేసులో గురువారెడ్డిని పోలీసులు విచారించారు. అయితే చేయని నేరానికి పోలీస్ స్టేషన్‌కు పిలిపించారని... తనను అన్యాయంగా కొట్టారని పేర్కొంటూ గురువారెడ్డి మంగళవారం సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.
 
ఆ తర్వాత రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చావుకు భార్య, అత్త, మామలే కారణమంటూ ఆ సెల్ఫీ వీడియోలో చెప్పాడు. భార్య, అత్త, మామ అక్రమ కేసు బనాయించారని.. కృష్ణలంక పోలీసులు కొట్టడంతో మనస్తాపం చెందానని గురువారెడ్డి తెలిపాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు