అవును..! హైదరాబాద్ కేసీఆర్ తాతల జాగీరే...!! ఇప్పుడు ఏంటట..!?.. మంత్రి మహేందర్ రెడ్డి

బుధవారం, 1 జులై 2015 (07:34 IST)
అవును...! హైదరాబాద్ కేసీఆర్ తాతలు, తండ్రుల జాగీరే.. తెలంగాణలో ఉన్న అందరి తాతల, తండ్రుల జాగీరేనని.. తెలంగాణ రాష్ట్రమంత్రి మహేందర్ రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు పదేపదే హైదరాబాద్ కేసీఆర్ తాత జాగీరా? అంటూ తమను రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీ మంత్రులు వేసిన ప్రశ్నపై స్పందించారు. 
 
హైదరాబాద్ ముమ్మాటికీ కేసీఆర్‌ తాతల జాగీరేనని, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి తాతలు, తండ్రుల జాగీరని అన్నారు. ఓటుకు నోటు కేసును తప్పుదారి పట్టించేందుకు సెక్షన్-8 పేరిట అలజడి సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఏపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. 

వెబ్దునియా పై చదవండి