హేమంత్ కేసులో రోజుకో ట్విస్ట్.. సుపారి గ్యాంగ్‌తో చంపించారట..!

శుక్రవారం, 2 అక్టోబరు 2020 (15:35 IST)
పరువు హత్యకు గురైన హేమంత్ కేసులో నిందితుల కస్టడి శుక్రవారంతో మూడో రోజుకు చేరుకుంది. మొన్న చర్లపల్లి జైలు నుంచి నిందితులను గచ్చిబౌలి పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. శుక్రవారం కూడా మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పోలీసు కస్టడీలో లక్ష్మారెడ్డి, యుగంధర్ రెడ్డిలు పలు కీలక అంశాలు వెల్లడిస్తున్నట్లు సమాచారం.
 
ప్రాణం కంటే పరువే ముఖ్యమని.. అందుకే హేమంత్‌ను హత్యమార్చినట్లు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి ఒప్పుకున్నాడు. హేమంత్ హత్యకు మొదట వేరే సుపారి గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు యుగంధర్ రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించారు. 
 
ఒప్పందం కుదిరాక సుపారీ గ్యాంగ్ స్పందించకపోవడంతో హేమంత్ హత్య వాయిదా పడిందన్నారు. దీంతో తనకు పరిచయం ఉన్న బిచ్చు యాదవ్‌తో మరో ఒప్పందం కుదుర్చుకున్న యుగంధర్ రెడ్డి విచారణలో వెల్లడించినట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు