జగన్ దీపావళి కానుక, రూ. 143 కోట్ల “కాపునేస్తం” నిధులు విడుదల

శనివారం, 7 నవంబరు 2020 (17:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కొరకు సీఎం జగన్ పలు సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను చేపట్టి వాటిని అంచెలంచెలుగా నెరవేరుస్తూ ప్రజాభిమానాన్ని చూరగొంటున్న విషయం తెలిసిందే. ఈ దిశగా కాపుల ప్రజా సంక్షేమం కోసం మరో పథకాన్ని రూపొందించారు. కాపుల కోసం ప్రత్యేకంగా కాపునేస్తం అనే పథకాన్ని ఏర్పరిచారు.
 
ఇందులో లబ్దిదారుల కోసం రూ. 142.87 కోట్లను విడుదల చేశారు. లబ్దిదారుల కొత్త జాబితా ప్రకారం అర్హులకు ఈ సాయాన్ని అందించనున్నారు. కొత్త జాబితా ప్రకారం 95,245 మందికి పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లబోయిన వేణు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి కాపు నేస్తం నిధులను అందిస్తామని తెలిపారు.
 
కాపులకు జగన్ ఇస్తున్న దీపావళి కానుక ఇది అని అన్నారు. బాధల్లో ఉన్న వారిని చూసి చలించే మనస్సు జగన్ గారిదని తెలిపారు. తమ పాద యాత్రలో ఎంతోమంది సమస్యలను విన్న జగన్ వాటికన్నింటికి పరిష్కారం చూపుతున్నారని తెలిపారు. అదేవిధంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే తత్వం జగన్ గారిదని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు