విజయవాడలో శుక్రవారం సిఎం క్యాంప్ కార్యాలయంలో కొనసాగుతోంది. ఈ కేబినెట్ రాజధాని, గన్నవరం ఎయిర్ పోర్టు, తదితర అంశాలపై చర్చించడానికి సమావేశమయ్యింది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలో నెలకొల్పే ఐఐటీకి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని, అలాగే ప్రతిభ పురస్కారాలకు కూడా ఆయన పేరు పెడితే సముచితంగా ఉంటుందని పలువురు మంత్రులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ఆరోగ్యసమస్యల కారణంగా ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి రాలేకపోయారు.