భార్యను వివస్త్రను చేసి ఇంటి నుంచి గెంటేశాడు.. ఆమె ఏం చేసిందంటే?

సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (17:51 IST)
నిర్భయ, దిశ వంటి ఘటనలు దేశాన్ని కుదిపేసినా.. కొత్త చట్టాలు వచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఏమాత్రం తగ్గట్లేదు. మహిళలపై దాడులు, అత్యాచారాలు, గృహ హింసలు జరుగుతూనే వున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో కట్టుకున్న భార్యను వివస్త్రను చేసి.. ఇంటి నుంచి గెంటేశాడు.. ఓ దుర్మార్గుడు. వివరాల్లోకి వెళితే.. భిక్కనూరు మండల కేంద్రంలో భార్య పట్ల భర్త పైశాచికత్వంగా ప్రవర్తించాడు. 
 
భార్యను చితక బాదిన భర్త ఆపై ఆమెను వివస్త్రను చేసి బయటకు గెంటేశాడు. ఇంటి నుంచి నగ్నంగానే పోలీస్‌స్టేషన్‌ను వెళ్లిన భాదితురాలు.. భర్త పైశాచికత్వంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన భిక్కనూరులో తీవ్ర కలకలం సృష్టించింది. బాధితురాలిని నగ్నంగా రోడ్డుపై చూసిన బంధువులు ఆమెకు బట్టలు వేసి ఇంటికి తీసుకెళ్లారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు