కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి తీవ్ర అస్వస్థత... ఐసీయూలో అడ్మిట్

మంగళవారం, 30 ఆగస్టు 2016 (09:42 IST)
కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మంగళవారం ఉదయం తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన సూర్యరావు పేటలోని ఆంధ్రా ఆసుపత్రిలో హర్ట్ అండ్ బ్రెయిన్ విభాగంలోని ఐసీయూలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన గత కొన్ని రోజులుగా ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెల్సిందే. 
 
ముఖ్యంగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆంధ్రా ఆసుపత్రి అధినేత డాక్టర్ పీవీ రమణమూర్తి తెలిపారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఐదుగురు డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి