పవన్ కళ్యాణ్ టీడీపీకి వ్యతిరేకం కాదట... కేఈ గారూ.. ఏం చెబితిరి.. ఏం చెబితిరి..!

గురువారం, 27 ఆగస్టు 2015 (13:05 IST)
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను మచ్చిక చేసుకోవడానికి తెలుగుదేశం నాయకులు నానా తంటాలు పడుతున్నారు. బలవంతంగా రైతుల భూములు లాక్కోవడానికి లేదని ఆయన ఒక్క స్టేట్‌మెంట్, ఒక యాత్ర చేశారో లేదో తెలుగుదేశం నాయకులకు గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. పైగా పవన్‌పై కామెంట్లు చేయవద్దని సీఎం అనడంతో మల్లగుల్లాలు పడుతున్నారు. 
 
అప్పటి నుంచి పవన్ మీద పీకలదాకా కోపం ఉన్నా, ఏమి మాట్లాడలేక నానా తంటాలు పడుతున్నారు. తాజాగా ఆ జాబితాలోకి ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా చేరిపోయారు. పవన్ ‌తమకు వ్యతిరేకంగా మాట్లాడలేదని సెలవిచ్చారు. ఆయనకు తెలుగుదేశం పార్టీపై ఎటువంటి కోపం లేదట. ఆయనను దువ్వే ప్రయత్నాలు చేశారు. 
 
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ధర్నాలు చేస్తున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణానికి భూసేకరణ అవసరం లేదనుకుంటున్నారన్నారు. వనజాక్షి పైన దాడి ఘటన పైన త్వరలో నివేదిక వస్తుంది చెప్పారు.

వెబ్దునియా పై చదవండి