జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను మచ్చిక చేసుకోవడానికి తెలుగుదేశం నాయకులు నానా తంటాలు పడుతున్నారు. బలవంతంగా రైతుల భూములు లాక్కోవడానికి లేదని ఆయన ఒక్క స్టేట్మెంట్, ఒక యాత్ర చేశారో లేదో తెలుగుదేశం నాయకులకు గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. పైగా పవన్పై కామెంట్లు చేయవద్దని సీఎం అనడంతో మల్లగుల్లాలు పడుతున్నారు.
అప్పటి నుంచి పవన్ మీద పీకలదాకా కోపం ఉన్నా, ఏమి మాట్లాడలేక నానా తంటాలు పడుతున్నారు. తాజాగా ఆ జాబితాలోకి ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా చేరిపోయారు. పవన్ తమకు వ్యతిరేకంగా మాట్లాడలేదని సెలవిచ్చారు. ఆయనకు తెలుగుదేశం పార్టీపై ఎటువంటి కోపం లేదట. ఆయనను దువ్వే ప్రయత్నాలు చేశారు.