సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని కారాగారంలో ఖైదీ ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చోరీ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఇతడు ఫినాయిల్ తాగడాన్ని గమనించిన తోటి ఖైదీలు జైలు అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఖైదీ మృతి చెందాడు.