ఆ సమయంలో పట్టిసీమ, పోలవరం అంశాలపై మాట్లాడేందుకు జగన్ ప్రయత్నించారు. అంతేకాకుండా తనకు ఇచ్చిన సమయం అయిపోయిన తర్వాత కూడా మాట్లాడుతూనే ఉన్నారు. దీంతో స్పీకర్, జగన్ మైకును కట్ చేయడంతో వైకాపా సభ్యులంతా స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు.
ఇది స్పీకర్కు ఆగ్రహం తెప్పించింది. వెంటన్.. జగన్నుద్దేశించి.. స్పల్పకాలిక చర్చ అంటే ఏమిటో మీకు తెలుసా? అని సూటిగా ప్రశ్నించారు. చర్చించాల్సిన విషయాన్ని వదిలేసి, ఇతర విషయాల జోలికి వెళ్తుంటే... నిర్ణీత సమయంలో ఏం మాట్లాడుతారని ప్రశ్నించారు. ఇలా చేస్తే, మీరే నష్టపోతారని హెచ్చరించారు.